PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రచారంలో దూసుకుపోతున్న రామచంద్రయ్య…

1 min read

రామచంద్రయ్యకు పెరుగుతున్న ప్రజల మద్దతు…

బిజెపి, తెలుగుదేశం, వైసిపి పార్టీలను ఇంటికి సాగనంపుదాం…

ప్రచారం నిర్వహిస్తున్న సిపిఐ నాయకులు.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఇండియా కూటమి బలపరుస్తున్న సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రామచంద్రయ్య ప్రచారానికి ప్రజల నుంచి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. శనివారం సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య, మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్ తో కలిసి పత్తికొండ పట్టణంలో బండిగేరి, చౌడమ్మ కాలనీ, ముస్లిం వీధి, చాకలి వీధి, సుంకం గేటు మీదుగా రామకృష్ణ నగర్, కోయ నగర్, వడ్డే వీది, స్టేట్ బ్యాంక్ సర్కిల్ కూడలి వరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు వెంకట రాముడు, నాగరాజు, నంద్యాల జిల్లా కార్యదర్శి శివయ్య, వాసు లు ప్రచారం ముందు భాగంలో రామచంద్రయ్యను గెలిపించాలని కోరుతూ ఆలపించిన విప్లవ గేయాలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అధికార, ప్రతిపక్ష పార్టీలు నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయకపోగా మోసపూరితపు హామీలతో ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు అడిగేందుకు వస్తున్న బిజెపి, తెలుగుదేశం, వైసిపి పార్టీలను ఇంటికి సాగనంపుదామన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించినట్లయితే పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి తో పాటు, పట్టణంలో రోడ్ల విస్తరణ, ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల నుండి 100 పడకల స్థాయికి పెంచడం,టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు, పత్తికొండ చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గా మార్చి తాగునీటి సమస్యకు శాశ్వత పరిస్కారం చూపుతామన్నారు. రామచంద్రయ్య కంకి కొడవలి గుర్తుకు, కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రాం పుల్లయ్య య తదితరులు పాల్గొన్నారు.

About Author