PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాంకుమార్ సేవలు మరువలేనివి

1 min read

జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి  కాటమ్ ప్రకాష్     

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలు జిల్లాలో గత 30 సంవత్సరాలుగా గ్రంధాలయాలకు సేవలందించిన పత్తికొండ శాఖ గ్రంథాల అధికారి రామ్ కమార్ సేవలు మరువలేనివని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కాటం ప్రకాష్ అన్నారు. పత్తికొండ స్థానిక శాఖ గ్రంధాలయంలో  పత్తికొండ గ్రంధాలయ శాఖ అధికారురి రాం కుమార్ సోమవారం పదవీ విరమణ వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కాటం ప్రకాష్,అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్య నారాయణ, డాక్టరు లక్ష్మణ స్వామి హాజరయ్యారు. పదవీ విరమణ పొందిన రాం కుమార్ ను శాలువాలతో,పూల మాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామ్ కుమార్ పత్తికొండ గ్రంధాలయ భవన నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు.పిల్లలు పుస్తక పఠనం కోసం చాల శ్రమించారని అన్నారు.గ్రంధాలయం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించడంలో రాం కుమార్ ముందు వరుసలో ఉన్నారని అన్నారు.వారి సేవలు మరువలేనివి అన్నారు.ఈ కార్యక్రమంలోపద్భనాభ మూర్తి, విశ్వనాథ్ రెడ్డి,మురళీ,వెంకటేష్ యాదవ్, సవ్వప్పా  ఈరన్న,నాగరత్నమ్మ,మురళీ కృష్ణ,రంగన్న, పోటో గ్రాపర్ కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు.

About Author