PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తి పంటను పరిశీలించిన ఆర్ ఏ ఆర్ ఎస్ శాస్త్రవేత్తలు 

1 min read

పల్లెవెలుగు వెబ్  గడివేముల : తిరుపాడు గ్రామంలో సాగు చేసినటువంటి పత్తి, మినుము మొక్కజొన్న, సోయాబీన్, తదితర పంటలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల శాస్త్రవేత్త శివరామకృష్ణ , ఎస్ఆర్ఎఫ్ హర్షవర్ధన్ , మండల వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి. వ్యవసాయ శాఖ సిబ్బంది పరిశీలించారు . పత్తి పంట లో వచ్చే పచ్చ దోమ పై .అదేవిధంగా సోయాబీన్ మరియు మినుము పంటలో ఆకు  తొలుచు పురుగు గమనించడం జరిగింది. వీటి నివారణకు వేప నూనె 5 ml ఒక లీటరు నీటికి,వర్షాబావ పరిస్థితుల వల్ల పెట్టను అధిగమించటానికి 10 శాతం యూరియాను  పిచికారి చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖకు సంబంధించి  పీఎం కిసాన్, కౌలు కార్డులు, ఆర్.బి.కె ల యందు ఎరువుల లభ్యత, పాడి పంటల మాసపత్రిక కొనుగోలు పై రైతులకు అవగాహన కల్పించారు.

About Author