PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగిసిన నామినేషన్ల స్వీకరణ

1 min read

చివరి రోజు 7 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు

 ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల స్వీకరణ

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ఎన్నికల లో ప్రదాన ఘట్టం నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా ముగిసింది. మంత్రాలయం నియోజకవర్గం లో గురువారం చివరి రోజు 7 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మురళి తెలిపారు. మంత్రాలయం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గా మాధవరం రాఘవేంద్ర రెడ్డి  మూడవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిలు గా యశోదమ్మ  నామినేషన్ వేశారు. కురువా నాగిరెడ్డి నామినేషన్ వేశారు. బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి గా గుడిపి సామేల్ నామినేషన్ వేశారు.  జాతీయ జనసేన పార్టీగా రాఘవేంద్ర రెడ్డి, అభ్యర్థి గా  నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పి ఎస్ మురళీ కృష్ణ రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి గా ముద్దనూర్ రాఘవేంద్ర రెడ్డి  నామినేషన్ దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. మొత్తం మంత్రాలయం అసెంబ్లీ నియోజక వర్గం కు 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మురళి తెలిపారు.

About Author