PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవత్వానికి మతము అడ్డురాదు

1 min read

అభి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు

పల్లెవెలుగు వెబ్ కమలాపురం  : అభి ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధుడికి అంత్యక్రియలు తిప్పనూరు గ్రామంలో ఎద్దుల పెద్ద శేషమ్మ వృద్ధాశ్రమంలో గత నాలుగు సంవత్సరాల నుంచి అనాధ ఆశ్రమంలో ఉంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. ఈ వృద్ధుడు ఉరుటూరు కు చెందిన నారపు రెడ్డి (75) సంవత్సరాలు శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆశ్రమం నిర్వాహకుడు నాగేంద్ర అభి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కు డాక్టర్ ఎన్ విజయ బాబుకు విషయం తెలుపగా అక్కడికి వెళ్లి సాంప్రదాయ పద్ధతిలో అంతక్రియలు నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎన్ విజయ్ బాబు, నాగేంద్ర ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాధలను అభాగ్యులను ఆదరించడం అన్నం పెట్టడం మహా పుణ్యకార్యం అన్నారు, అలాగే ఎవరు లేకుండా మరణించిన వారికి మేమున్నామంటూ అనాధగా కాకుండా సంప్రదాయపద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని అన్నారు, ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొంటూ మానవత్వం కలిగిన మాకు దైవానుగ్రహంతోనే కార్యక్రమాలన్నీ ట్రస్ట్ ద్వారా చేస్తున్నామని తెలిపారు, ఈ కార్యక్రమంలో కమల్ భాష , కత్తులూరు శివ, ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

About Author