PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెద్దల సమక్షంలో పునర్వివాహం

1 min read

పల్లెవెలుగు వెబ్  సింగనమల :  అనంతపురం జిల్లా సింగనమల మండలం రాచేపల్లి గ్రామానికి చెందిన నాగార్జున, తరిమెల గ్రామానికి చెందిన వరలక్ష్మి (రాధమ్మ) నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తరిమెల గ్రామంలో తెలియడంతో, తరిమెల గ్రామంలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఫలితంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనంతపురానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి కొత్తూరు లక్ష్మీనారాయణ, ఆ పార్టీ గార్లదిన్నె మండల అధ్యక్షుడు  రామాంజనేయులు ఆచారిని సంప్రదించి శనివారం అనంతపురంలోని చెరువు కట్టపై ఉన్న అమ్మవారి ఆలయంలో పునర్వివాహం చేసుకున్నారు.  తరిమల గ్రామానికి చెందిన కొంతమంది సమక్షంలో ఆలయ పూజారులు వివాహం జరిపి ఆశీర్వదించారు. అనంతరం దంపతులు తరిమెల గ్రామానికి వెళ్లారు.

About Author