PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సహకార సొసైటీ చైర్మన్ పదవికి రాజీనామా..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పీరుసాహెబ్ పేట సహకార సొసైటీ చైర్మన్ పదవికి  తమిదెల నాగ తులసి రెడ్డి శనివారం రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల ఆయన రాజీనామా చేశారు.ఈ సందర్భంగా నాగ తులసి రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర శాప్ చైర్మన్& నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో 04.8.2019 నుండి సొసైటీ చైర్మన్ గా ఉన్నానని దాదాపుగా ఐదు సంవత్సరాల్లో రైతుల అభివృద్ధికి ఎంతగానో అభివృద్ధి చేశామని అన్నారు.కానీ ప్రభుత్వం మారడం వల్ల స్వయంగా నేనే తన పదవికి రాజీనామా చేస్తున్నానని ఈ రాజీనామాను డిసీసీబీ కార్యాలయానికి పంపినట్లు ఆయన తెలిపారు.

About Author