PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా కెవిఎన్ రాజేశ్వరి పదవీ విరమణ

1 min read

వ్యవసాయ శాఖలో 44 సంవత్సరాలుగా అంకితభావంతో విధి నిర్వహణ

ఉత్తమ అధికారిణి గా పలువురు అధికారులచే ప్రశంసలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : 44 యేళ్లు ఉన్నతమైన ఉద్యోగ సేవలు అందించి అందరి మన్ననలు అందుకున్న కె వి ఎన్ రాజేశ్వరి పలువురు ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ అధికారి( భీమవరం)  జెడ్ వెంకటేశ్వర్లు అన్నారు.  ఏలూరులోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆదివారం నాడు జరిగిన పదవీ విరమణ సభలో ఆయన మాట్లాడారు. భీమవరంలోని పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం పరిపాలన అధికారిగా సేవలందించి పదవి విరమణ చేసిన కెబిఎన్ రాజేశ్వరి కి ఘనంగా వీడ్కోలు సభ జరిగింది.  ఈ సభలో జెడ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 44 ఏళ్ల పాటు ప్రభుత్వ సర్వీసులో సేవలందించి, ఎటువంటి మచ్చ లేకుండా పదవీ విరమణ చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. తన పరిపాలన అనుభవాన్ని సహచరులకు, జూనియర్లకు పంచి ఇచ్చి తన వంతు కృషి చేసిన కెబిఎన్ రాజేశ్వరి ఉన్నత అధికారుల మన్ననలను అందుకున్నారని అన్నారు. ఏలూరు డిఏఓ షేక్ అబీబ్ భాష మాట్లాడుతూ జిల్లా రాష్ట్ర అసోసియేషన్లలో నాయకురాలుగా సేవలందిస్తూ అసోసియేషన్కు అధికారులకు మధ్య సమన్వయకర్తగా కెబిఎన్ రాజేశ్వరి ఎంతో చాకచక్యంగా బాధ్యతలు నిర్వర్తించే వారిని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (ఏ పి ఏ ఈ ఎస్ ఏ)  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు వడ్లపూడి నాగరాజ గంగాధర్ మాట్లాడుతూ  యూనియన్ పరంగా రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాలను జిల్లా కమిటీలో జిల్లా కార్యకర్తలకు వివరించి చెప్పి దాన్ని అమలు చేయడంలో ఆమె కృషి అభినందనీయమన్నారు.  కమిషనరేట్ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో నాయకత్వం బాధ్యతలను కెబిఎన్ రాజేశ్వరి ఎంతో చక్కగా నిర్వర్తించేవారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వేదికపై ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిణి సాకా నాగమణి, గుంటూరు కమిషనరేట్ నుండి డి ప్రమీల, ఏపీ ఎన్జీవో నాయకులు భోగరాజు ఏపీ ఏ ఈ ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ కార్యదర్శి రవికుమార్ కార్యవర్గ సభ్యులు,  రిటైర్డ్ జేడీఎస్ లు పాల్గొన్నారు. పదవి విరమణ సభలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు. 44 యేళ్లు ఉన్నతమైన ఉద్యోగ సేవలు అందించి అందరి మన్ననలు అందుకున్న కె వి ఎన్ రాజేశ్వరి పలువురు ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ అధికారి( భీమవరం)  జెడ్ వెంకటేశ్వర్లు అన్నారు.  ఏలూరులోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆదివారం నాడు జరిగిన పదవీ విరమణ సభలో ఆయన మాట్లాడారు. భీమవరంలోని పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం పరిపాలన అధికారిగా సేవలందించి పదవి విరమణ చేసిన కెబిఎన్ రాజేశ్వరి కి ఘనంగా వీడ్కోలు సభ జరిగింది.  ఈ సభలో జెడ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 44 ఏళ్ల పాటు ప్రభుత్వ సర్వీసులో సేవలందించి, ఎటువంటి మచ్చ లేకుండా పదవీ విరమణ చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. తన పరిపాలన అనుభవాన్ని సహచరులకు, జూనియర్లకు పంచి ఇచ్చి తన వంతు కృషి చేసిన కెబిఎన్ రాజేశ్వరి ఉన్నత అధికారుల మన్ననలను అందుకున్నారని అన్నారు. ఏలూరు డిఏఓ షేక్ అబీబ్ భాష మాట్లాడుతూ జిల్లా రాష్ట్ర అసోసియేషన్లలో నాయకురాలుగా సేవలందిస్తూ అసోసియేషన్కు అధికారులకు మధ్య సమన్వయకర్తగా కెబిఎన్ రాజేశ్వరి ఎంతో చాకచక్యంగా బాధ్యతలు నిర్వర్తించే వారిని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (ఏ పి ఏ ఈ ఎస్ ఏ)  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు వడ్లపూడి నాగరాజ గంగాధర్ మాట్లాడుతూ  యూనియన్ పరంగా రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాలను జిల్లా కమిటీలో జిల్లా కార్యకర్తలకు వివరించి చెప్పి దాన్ని అమలు చేయడంలో ఆమె కృషి అభినందనీయమన్నారు.  కమిషనరేట్ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో నాయకత్వం బాధ్యతలను కెబిఎన్ రాజేశ్వరి ఎంతో చక్కగా నిర్వర్తించేవారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వేదికపై ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిణి సాకా నాగమణి, గుంటూరు కమిషనరేట్ నుండి డి ప్రమీల, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర నాయకులు భోగరాజు, ఏపీ ఏ ఈ ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షులు కుమార్, కార్యదర్శి రవికుమార్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.  కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని వ్యవసాయ అధికారుల కార్యాలయానికి సంబంధించిన  అధికారులు,ఉద్యోగులు,సిబ్బంది పాల్గొని పదవీ విరమణ చేసిన కేవీయన్ రాజేశ్వరికు ఆమె భర్త కెవిఎన్ వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. పూల బొకేలు,  మొమెంటోలు, శాలువాలు,  సన్మాన పత్రాలు,పూలదండలతో ముంచెత్తారు.  తనకు జరిగిన సన్మానానికి కేబీఎన్ రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాల మేరకు తాను నడుచుకున్నానని, సహచర సిబ్బంది సహకారంతో తాను అందరి మన్ననలను అందుకున్నానని అన్నారు.  ఈ కార్యక్రమంలో భీమవరం, ఆకివీడు, కేఆర్ పురం, ఏలూరు, తణుకు, నరసాపురం, భీమడోలు, చింతలపూడి, ఏలూరు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం ప్రాంతాలలోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ ( ఏ డి ఏ) కార్యాలయ  అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

About Author