PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి.. నంద్యాల జేసి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ( పి జి ఆర్ ఎస్) వచ్చే ప్రతి ఫిర్యాదును స్వయంగా తహసిల్దార్ పరిష్కరించాలని గురువారం నాడు రెవెన్యూ అధికారులతో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ పరంగా వచ్చే సమస్యలపై అధికారులు స్పందించాలని సర్టిఫికెట్లు త్వరగా  జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు మండలంలో 1227 కౌలు రైతు కార్డులకు గాను 36 పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే పూర్తిచేయాలని. ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ బిఎన్ విద్యాసాగర్. డిప్యూటీ తాసిల్దార్ గురునాథం. వీఆర్వోలు పాల్గొన్నారు.

About Author