PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెవెన్యూ..మున్సిపాలిటీలో బదిలీలు

1 min read

నందికొట్కూర్ లో మొదటిసారిగా భారీగా బదిలీలు..

పల్లెవెలుగు వెబ్  నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరులో రెవెన్యూ మరియు మున్సిపాలిటీ కార్యాలయాల్లో భారీగా బదిలీలు జరిగాయి. మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి బాలమద్దయ్య ఆదోనికి బదిలీ అయ్యారు. ఇక్కడికి కర్నూలు నుంచి రంగస్వామిని నియమించారు. జూనియర్ అసిస్టెంట్ సుచరిత గూడూరు మున్సిపాలిటీకి  అదే కార్యాలయం నుండి శ్రీనివాసులు ను ఇక్కడికి నియమించారు. సీనియర్ అసిస్టెంట్ రమణయ్య కడప జిల్లా బద్వేల్ కు ఇక్కడికి ఎమ్మిగనూరు నుంచి మహబూబ్ బాష ను నియమించారు. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ సృహత ఎమ్మిగనూరుకు..ఇక్కడ ఉన్న ఆర్వో విజయలక్ష్మి గూడూరుకు..ఇక్కడ మధుసూదన్ బాబు ఆర్వో గా విధుల్లో చేరారు.గ్రామ రెవెన్యూ అధికారులకు స్థానాలు కేటాయిస్తూ నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.వీఆర్వోలకు కేటాయించిన స్థానాలు ఈ విధంగా ఉన్నాయి.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో వడ్డెమాను గ్రామ విఆర్ఓ గా ఎన్ రంగన్న, శాతనకోట వీఆర్వో గా వి ఆనంద్,మల్యాల-మనోహర్, నాగటూరు-బి స్వాములు, బ్రాహ్మణకొట్కూర్-టి హనుమంత్,10 బొల్లవరం- మనోహర్ గౌడ్,దామగట్ల- మద్దిలేటి,నందికొట్కూరు సంగయ్య పేట-వెంకటేశ్వర్లు, నందికొట్కూరులో విఆర్ఓగా పనిచేస్తున్న రషీద్ కొత్తపల్లి మండలం ఎర్రమఠం నకు బదిలీ అయ్యారు. ముచ్చుమర్రి-నరసింహులు, తిక్కస్వామి..లక్ష్మాపురం-హరి హరినాధ రావు,భగవాన్ దాస్..80 బన్నూరు- అల్లావుద్దీన్,తాటిపాడు- బాలకృష్ణ,తరిగోపుల- చంద్రశేఖర్ నాయుడు, తంగడంచ-రియాజ్ రెహమాన్,పగిడ్యాల1-నాగన్న.. వీరికి స్థానాలు కేటాయిస్తూ కలెక్టర్ బదిలీ చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *