PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ ఉద్యోగి పురస్కార పత్రాన్ని అందుకున్న  ఆర్ఐ  వి.సుధాకర్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: రోడ్డు పవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఆధ్వరంలో జిల్లా కేంద్రమైన నంద్యాల నగరంలో గురువారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి పురస్కార పత్రాన్ని  ప్యాపిలి ఆర్ఐ  వి.సుధాకర్ రెడ్డి అందుకున్నారు. ఈయన ప్యాపిలి తాసిల్దార్ కార్యాలయంలో రెండు సంవత్సరాల నుండి సీనియర్ అసిస్టెంట్ మరియు ఆర్ఐగా విధులు నిర్వహిస్తూ తమ తోటి ఉద్యోగులకు సహాయం పడుతూ, కార్యాలయం కి వచ్చిన ప్రజలకు సేవలందించిన  వి .సుధాకర్ రెడ్డిని గుర్తించి ఉత్తమ ఉద్యోగి పురస్కారం అందజేశారు. ఈ పురస్కారం ఆయనకు ఇవ్వడంతో సహ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడైనా తమ విధులు తమ నిర్వహించినప్పుడే మనకు గుర్తింపు వస్తుందని, నా వంతు నేను ప్రజలకు సేవలందించినానని ,అందుకే ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఉత్తమ ఉద్యోగుగా పురస్కారం అందించారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. అలాగే ప్యాపిలి మండలంలో  ఇఓఆర్డిగా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణకు కూడా ఉత్తమ ఉద్యోగి గా పురస్కారం అందుకున్నారు. మండలంలో ఇద్దరు అధికారులకు ఉత్తమ ఉద్యోగి పురస్కారం అందుకున్నందుకు ప్యాపిలి మండల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.

About Author