PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరద బాధితులకు ఆర్ఎంపీ ల భరోసా..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: విజయవాడలో జరిగిన అతి భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న వరద బాధితులకు ఆర్థిక మరియు వస్తువుల రూపంలో అక్కడికి వెళ్లి బాధితులకు మానవత వాదంతో స్పందిస్తూ వారికి అందించడంలో దాతలు ముందుకెళ్తున్నారు. మంగళవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు ఆర్ఎంపీ వైద్యులు వరద బాధితులకు మా వంతుగా సహకారం అందిస్తామని వైద్యుల మమకారాన్ని చాటుకున్నారు ఆర్ఎంపీలు..మ.3:30 కు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ను అల్లూరు గ్రామంలోని మాండ్ర శివానందరెడ్డి స్వగృహంలో కలసి ఆర్ఎంపీలు 65,800 రూపాయల చెక్కును ఎమ్మెల్యేకు అందించారు. చెక్కును అందించిన వారిలో ఆర్ఎంపీ వైద్యులు బివి రమణ,వనజ,నాగరాజు, మధు కుమార్,భాష,గోపాల్, రమణారెడ్డి,ఎర్రన్న, నాగశేషులు,అనురాధ,గీతా రాణి పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *