PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జన జాతర లా రోడ్ షో

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు మండలం కందనాతి,కడివెల్ల,గ్రామాల ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక, సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి,లకు జన జాతర లా రోడ్ షో లో స్వాగతం పలికారు.ఎమ్మిగనూరు మండలం కందనాతి, కడివెల్ల,గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక , సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల తో కలిసి రోడ్ షో నిర్వహించారు. వారు మాట్లాడుతూ మన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి  బలపరిచిన, ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఆమె మాట్లాడుతూ బీసీ మహిళ అయిన నాకు మీరు నన్ను ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఎమ్మిగనూరు మీరందరి సహాయ సహకారాలతో  అభివృద్ధికి కృషి చేస్తానని, రోడ్లు, డ్రైనేజీలు,వాటర్ సమస్యలు జగనన్న దృష్టికి తీసుకెళ్లి శాశ్విత పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.మీ అమూల్యమైన ఓట్లను మంచి చేసే జగనన్నకే  ఓటు వేయాలని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఎంపీ అభ్యర్థి అయిన బి వై రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించాలని అభ్యర్థించారు.ఈ ప్రచారంలో రాష్ట్ర వీర శైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్ర గౌడ్,మండల అధ్యక్షులు బిఆర్ బసిరెడ్డి, సోగునూరు భీమిరెడ్డి, ఎంపీపీ కేశన్న,  ఆయా గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు,నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author