PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రగ్బీ విజేత అనంతపురం…

1 min read

ముగిసిన అండర్ 19 ఎస్జిఎఫ్ రగ్బీ ఛాంపియన్షిప్

పల్లెవెలుగు వెబ్ అనంతపురం:  రెండు రోజుల పాటు స్థానిక ఆదర్శ విద్యా మందిర్ క్రీడా మైదానంలో జరిగిన అండర్ 19 ఎస్జిఎఫ్ బాలికల ఛాంపియన్షిప్ గురువారంతో ముగిసింది. 12 జిల్లాల నుండి ఛాంపియన్షిప్లో పాల్గొన్న బాలికల పోటీలలో అనంతపురం జిల్లా జట్టు ట్రోఫి కైవసం చేసుకుంది.  తూర్పుగోదావరి జిల్లా జట్టుపై జరిగిన తుది పోరులో అనంతపురం జట్టు 20- 0 ట్రైస్ తో ఛాంపియన్షిప్ గెలుపొందింది. కాగా తూర్పుగోదావరి జట్టు రెండవ స్థానంతో రన్నర్ ట్రోఫీ కైవసం చేసుకుంది. మూడో స్థానం కోసం జరిగిన హార్డ్ లైన్ పోటీలో ఆతిథ్య కర్నూలు జిల్లా జట్టు పశ్చిమగోదావరి జట్టుపై 25 – 0 ట్రైస్ తో సునాయస  విజయాన్ని కైవసం చేసుకుని కాంస్య పత కాలతో మెరిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వృత్తి విద్యా అధికారి వై. పరమేశ్వరరెడ్డి,ఆర్ ఐ ఓ గురువయ్య శెట్టి,ఆదర్శ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ హరికిషన్, రాష్ట్ర రగ్బీ సంగం  కార్యదర్శి బొల్లావరం రామాంజనేయులు, అండర్ 19ఎస్.జీ.ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సి హర్షవర్ధన్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. అనంతరం రాష్ట్ర పోటీల పరిశీలకులు గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టును ప్రకటించారు.

About Author