PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కడుమూరు సర్పంచ్..టీడీపీ లో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామ సర్పంచ్ సందెపోగు జీవరత్నం వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.గురువారం ఉదయం 11 గంటలకు నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్వగృహం కర్నూలులో కడుమూరు గ్రామ టిడిపి సీనియర్ నాయకులు పీజీ రామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బైరెడ్డి సమక్షంలో సర్పంచ్ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. సర్పంచ్ తో పాటు కే డేవిడ్ ప్రతాప్ నాగరాజు పురుషోత్తం యూసుఫ్ పార్టీలో చేరారు. వీరందరినీ బైరెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించి గ్రామ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తానని బైరెడ్డి వారికి హామీ ఇచ్చారు.అంతే కాకుండా గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఆయన వారితో అన్నారు. ముందుగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని గ్రామ సర్పంచ్ జీవరత్నం శాలువా పూల బోకేతో ఘనంగా సన్మానించారు.

About Author