PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సర్పంచ్ భర్త ఎంపీటీసీ..టిడీపీ లోకి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని వీపనగండ్ల వైసీపీ నాయకులు గ్రామ సర్పంచ్ భారతి భర్త చందాపురం తిమ్మారెడ్డి మరియు ఎంపీటీసీ కోటీశ్వరుడు టిడిపి పార్టీలో చేరారు.శుక్రవారం మధ్యాహ్నం నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్వగృహంలో వారు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వీరితోపాటు గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ రమణారెడ్డి, రఘుస్వామి రెడ్డి మాధవరెడ్డి మహేశ్వరయ్య నాగేశ్వరరావు రవి శేఖర్ రెడ్డి తదితర కుటుంబాలు టిడిపి పార్టీలో చేరారు వీరందరిని రాజశేఖర్ రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.మీకు ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించడానికి నా శాయ శక్తులా కృషి చేస్తానని బైరెడ్డి వారికి భరోసా ఇచ్చారు.

About Author