PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల :  గడివేముల:నేను బడికి పోతా” కార్యక్రమంలో భాగంగా, శుక్రవారం నాడు మండలంలోని అన్ని పాఠశాలల్లో ర్యాలీ నిర్వహించారు. గని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జరిగిన ర్యాలీలో ఎంఈఓ మేరీ సునీత పాల్గొన్నారు, గడివేముల స్పెషల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యందు జరిగిన ర్యాలీలో ఎంఈఓ విమల వసుంధర దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు ఉన్నoదున, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారు తెలిపారు, కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, జీ ఏం ఏస్ కే  పాల్గొన్నారు.

About Author