PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

13 న పాఠశాలలు పునఃప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు యాజమాన్యాలలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నతపాఠశాలల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమేమనగా వేసవి సెలవుల తరువాత 2024-2025 విద్యా సంవత్సరం లో ప్రభుత్వ ఆదేశానుసారం తేది 12.06.2024 బుధవారానికి బదులు తేది:13.06.2024 గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.అలాగే పాఠశాలలు పునఃప్రారంభం తేది నాటికి పాఠశాల ప్రాంగణం మరియు తరగతి గదులు శుభ్రపరచుకొనవలెను. పాఠశాల ఆవరణలో పొదలు / ముళ్ళచెట్లను తొలగించవలెను. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సంబంధించిన వంట వండేవారు వంటశాలలను శుబ్రపరచుకొని మరియు వంటపాత్రలను పరిశుభ్రంచేసుకొని వంట వండవలెను. ఈ విషయం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించడమైనది.జిల్లా లోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ.కె. శామ్యూల్ ఒక ప్రకటనలో తెలియజేసారు.

About Author