PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

10 ఫలితాల్లో 562 మార్కులు సాధించిన జడ్పీహెచ్ పాఠశాల విద్యార్థిని 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:   పత్తికొండ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10 తరగతి విద్యార్థిని భార్గవి పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 562 మార్కులు సాధించింది. పదో తరగతి ఫలితాల్లో టాపర్గా నిలిచిన భార్గవిని పాఠశాల సిబ్బంది అభినందించారు. స్కూల్ ప్రధానోపధ్యాయురాలు భ్రమరాంబ ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు పద్మశ్రీ, పద్మావతి,సునీత, సత్యనారయణ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ,విద్యార్థినిని అభినందించారు. ఈ సందర్భంగా భ్రమరాంబ మాట్లాడుతూ,10 తరగతిపరీక్షకు  170మంది హాజరు కాగా 71మంది ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం భ్రమరాంభ తెలిపారు. పాఠశాల విద్యార్థులు భార్గవి 562, అశ్విత 529, ఆష్మ బాను 511,శ్రీజ 505 మార్కులు సాధించి జడ్పీహెచ్ బాలికల పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారని ఆమె అన్నారు.

About Author