PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రాలయం టిడిపి లో బయట పడ్డ వర్గ విబేధాలు

1 min read

మధ్యాహ్న భోజన విషయంలో టిడిపి లో ఇరువర్గాల వాగ్వివాదం

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  నియోజకవర్గ కేంద్రమైన  మంత్రాలయం టిడిపిలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంగళవారం మంత్రాలయం లోని సంత మార్కెట్ లో ఉన్న మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మద్యాహ్న భోజనం పథకం తమకంటే తమకు అంటూ టిడిపి జిల్లా అధ్యక్షులు పి. తిక్కారెడ్డి వర్గీయులు ఓటమి పాలైన టిడిపి అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి వర్గీయులు మద్య వాగ్వివాదం చేసుకోవడంతో ఘర్షణకు దిగారు. దీంతో ఎసై గోపినాథ్ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని టిడిపి ఇరు వర్గాలను చెదరగొట్టారు. మధ్యాహ్నం భోజనం పథకం ఏజెన్సీ కోసం టిడిపిలో ఇరువర్గాలు తమకంటూ తమకు అని పోటా పోటికి దిగారు. ఈ సంఘటన తో అధికారులకు తల నొప్పిగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి జిల్లా అధ్యక్షులు పి తిక్కారెడ్డి వర్గం తమకు మద్దతు చేయలేదని అందుకే ఓటమి చవి చూడాల్సి వచ్చిందని టిడిపి అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి వర్గీయులు బహిరంగంగా విమర్శలు చేశారు.ఇది ఇలా ఉంటే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్య లత మాట్లాడుతూ ఉన్నత అధికారుల నుంచి ఆర్డర్ కాఫీ చూపించిన వారి కి అనుమతి ఇస్తామని తెలిపారు. అంత వరకు వేరే వాళ్ళ తో మధ్యాహ్నం భోజనం చేయించి పిల్లలకు భోజనం పెడతామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

About Author