PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అభివృద్ధిని చూడండి

1 min read

పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిపిజి రాంపుల్లయ్య యాదవ్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కర్నూలును అభివృద్ధి చేసి చూపిస్తామని కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీజీ రాంపుల్లయ్య యాదవ్  తెలియజేశారు. శుక్రవారం ఉదయం కర్నూలు నగరం నందలి ఎనిమిదో వార్డు దండేగేరి నందు లక్కీటు పీజీ రాంపుల్లయ్య యాదవ్  మరియు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి షేక్ జిలాని భాష  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే కర్నూలును అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. రాంపుల్లయ్య యాదవ్  మాట్లాడుతూ  మమ్మల్ని గెలిపిస్తే తాగునీటి కోసం కర్నూలు ప్రజలు పడుతున్న ఇబ్బంది రీత్య 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కట్టించి కర్నూలు ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని,  డ్రైనేజీ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డ్రైనేజీలు కొత్తవి నిర్మిస్తామని,భరోసా కల్పించారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి షేక్ జిలాని భాష మాట్లాడుతూ హస్తం గుర్తుకు ఓట్లు వేసి రాంపుల్ల యాదవ్ని మరియు మమ్ములను గెలిపిస్తే కర్నూలు అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం జిల్లా సేవాదళ్  మహిళా అధ్యక్షురాలు ఏ వెంకట సుజాత కాంగ్రెస్ నాయకులు లోకనాథ్ యాదవ్, ప్రదీప్ యాదవ్, షేక్ మాలిక్ భాష మొదలుగు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

About Author