PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు రవీంద్ర విద్యార్థుల ఎంపిక

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   స్థానికంగా కర్నూల్ యోగ అసోసియేషన్ వారు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన యోగ పోటీలు మరియు ఎంపిక లో రవీంద్ర విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆదివారం ముగిసిన జిల్లా స్థాయి యోగ పోటీలలో రవీంద్ర విద్యార్థులు, 10-12 ఏళ్ల విభాగంలో సి.సాకేత్ మరియు మొహమ్మద్ సాద్. 12-14 ఏళ్ల విభాగంలో సి.లిఖిత్, 8-10  ఏళ్ల విభాగంలో పి.తనిష్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైనందుకుగాను పాఠశాల యాజమాన్యం వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో శ్రీ జీ. వంశీధర్  వైస్ చైర్మన్, రవీంద్ర విద్యా సంస్థలు, పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు అదేవిధంగా రాష్ట్రస్థాయి పోటీలలో మెడల్ సంపాదించుకు రావాలని  ఆశాభావం వ్యక్తపరిచారు. యోగ రోజువారి దినచర్యలో భాగం చేసుకోవడం వలన మానసిక మరియు శారీరక ఉత్సాహం ఉంటుందన్నారు. అలాగే  ప్రధానమంత్రి శ్రీ.నరేంద్ర మోడీ వలన యోగాకు అంతర్జాతీయ ఆదరణ లభిస్తుందని ఈ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ భబిత మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author