PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి

1 min read

వైద్య రంగంలో పరిశోధనలతో సరికొత్త వైద్య పద్ధతులను కనిపెట్టాలి

నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : భావి వైద్యులుగా  లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయాలని, వైద్య రంగంలో పరిశోధనలతో సరికొత్త వైద్య పద్ధతులను కనిపెట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా నీట్ పరీక్షలో మెడిసిన్ సీటును సాధించిన విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో చిన్నటేకూరులోని డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల కళాశాల ఐఐటీ మెడికల్ అకాడమీ ద్వారా శిక్షణ పొంది నీట్ లో ప్రతిభ కనబరిచి మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులను  కలెక్టర్ అభినందించారు..ఈ విద్యార్థులందర్నీ   కలెక్టర్ శాలువాతో సత్కరించి, పెన్ను ను బహుమతిగా అందచేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులు, అధ్యాపకులతో  సమావేశం అయ్యారు.. వారితో మాట్లాడుతూ భవిష్యత్తులో వైద్యులుగా సమాజానికి సేవ చేయాలని సూచించారు..లాభాపేక్ష లేకుండా పేదలకు సేవలందించాలని సూచించారు.. వైద్య రంగంలో పరిశోధనల వైపు దృష్టి సారించి, మరెన్నో వైద్య పద్ధతులను కనిపెట్టాలని సూచించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో పాటు అధ్యాపకులను అభినందించారు.కల్లూరు మండలం చిన్నటేకూరులోని డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల కళాశాల ఐఐటీ మెడికల్ అకాడమీ లో అడ్మిషన్స్, సౌకర్యాల గురించి డిసివో, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు.. ఈ ఏడాది అకాడమీ నుండి  20 మంది విద్యార్థులు ఎంబిబిఎస్ కు, 8 మంది విద్యార్థులు ఐఐటీకి, 25 మంది విద్యార్థులు నిట్ కు, 7 మంది విద్యార్థులు సియూసెట్, ఒకరు ఐఐఐటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని డిసిఒ కలెక్టర్ కు  వివరించారు.కార్యక్రమంలో డిసిఓ శ్రీదేవి, ఐఐటీ మెడికల్ అకాడమీ డైరెక్టర్ ప్రత్యూష, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *