PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : మండలంలోని రామనపల్లి బీసీ కాలనీలో గత నాలుగు నెలలుగా త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గురువారం బీసీ కాలనీ మహిళలు గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు, బీసీ కాలనీలో గత నాలుగు నెలలుగా తమకు త్రాగునీరు అందడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు,ప్రొదున లేస్తే వ్యవసాయ పనులు కూలి పనులకు వెళ్తూ సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఎక్కడో గుంతలలో నిలిచిన నీరు పట్టుకోవలసి వస్తుందని మహిళలుమండి పడ్డారు,కాలనీలో నీరు అందకుండా పోతున్నదని తమకు త్రాగునీటి వసతి కల్పించాలని కోరినప్పటికీ తమ సమస్య తీర్చలేదని మహిళలు పేర్కొన్నారు, ఈ విషయంపై గురువారం గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శి ఎదుట తమ గోడు ఎలపుచ్చుకున్నారు. బీసీ కాలనీలో త్రాగునీటి సమస్య వెంటనే తీర్చాలని వారు డిమాండ్ చేశారు.

About Author