PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి.. ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని:  విద్యార్థిని విద్యార్థులందరూ చదువుతోపాటు క్రీడల్లో కూడా రానిచ్చి రాష్ట్రస్థాయి జాతీయస్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు.గురువారం ఆదోని మున్సిపల్ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవం హాకీ మాంత్రికుడు శ్రీ ధ్యాన్చంద్ జయంతినీ పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి  సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోని అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా రోజుకు రెండు గంటలసేపు ఆటలు ఆడడం వల్ల మనిషికి ఆరోగ్యం మరియు ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా ఆటల్లో రాణించిన ప్రతి విద్యార్థి కూడా జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి జాతీయస్థాయి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. విద్యార్థులు యువత క్రీడల్లో రాణించడానికి ఏ సహాయం కావాలన్నా నేను చేస్తానని క్రీడాకారులకు హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం జరిగిన ర్యాలీ లో పాల్గొన్నారు   ఈ కార్యక్రమంలో ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంత, క్రీడాకారుల సంఘం అధ్యక్షులు విట్టా రమేష్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్  అనుపమ , టీడీపీ ఎక్స్ అసెంబ్లీ ఇంచార్జ్ జి క్రిష్ణమ్మ పి ఈ టీ లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author