PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ నారా చంద్రబాబునాయుడు  రాష్ట్రాని కి దిక్సూచి లాంటి మహా నాయకుడు

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం: 1995 నాడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు  నాయకత్వం చేపట్టక పోయి ఉంటే ఈనాడు తెలుగుదేశం పార్టీ ఉండేది కాదని రాష్ట్ర టిడిపి లీగల సెల్ కార్యదర్శి లాయర్ బాబు అన్నారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి కోసం రోజు 18 గంటలు అహర్నిశలు కృషి చేశారన్నారు రాష్ట్రంలో హైటెక్ సిటీ ఏర్పాటు చేసి ఐటీ రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికారన్నారు రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి లాంటి వారన్నారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల వైసిపి పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు అవమానాలు అక్రమ గా అరెస్ట్ చేసి  53 రోజులు జైలుకు పంపిన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి నిద్రలేని రాత్రులు గడిపి  శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరిగిందన్నారు ఒకానొక సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో వైసీపీ దుర్మార్గులు వ్యక్తిగత దూషణతో అవమానపరిచిన ఈ కౌరవసభలో ఉండనని మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర అసెంబ్లీ దేవాలయంలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేయడం జరిగిందన్నారు అలాంటి అవమానాలు భరించలేక మీడియా ముందర కంటినీరు పెట్టడం జరిగిందన్నారు  వైసిపి ప్రభుత్వం అరాచక పాలనను రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం సభలలో పాల్గొని రాష్ట్ర ప్రజలు చైతన్యపరిచి రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి కి అఖండ విజయం చేకూర్చిన తర్వాతే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా అడుగు పెట్టడం జరిగిందన్నారు తెలుగుదేశం పార్టీకి నాయకులకు కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు  దేవునితో సమానం అన్నారు వైసీపీ ప్రభుత్వంలో సర్వనాశమైన రాష్ట్రాన్ని కేంద్ర రాష్ట్రాల ఎన్డీఏ కూటమి తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి పోలవరం అమరావతి రాజధాని నీ పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు కి శక్తి ప్రసాదించమని దేవుని కోరుకుంటున్నాను అన్నారు.

About Author