PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీకృష్ణ శ్లోక పఠన పోటీలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల :    శ్రీకృష్ణ జయంతి 27.8.2024 సందర్భంగా  శ్రీ కృష్ణ దేవాలయం పద్మావతి నగర్ నంద్యాల యందు 18.8.2024 న ఉదయం 10గంటల నుండి చిన్న పిల్లలకు భగవద్గీత 12,15,16 అధ్యయముల నుండి శ్లోక పఠాన పోటీ నిర్వహించబడినది.28 మంది పిల్లలు పాల్గొని న్యాయనిర్ణేతలు గా కూర్చిన్న శ్రీ భాస్కర్ రెడ్డిని, శ్రీ వెంకటేశ్వర్లు ని,శ్రీ జీ. వెంకట రమణయ్య ని , శ్రీమతి ఉమామహేశ్వర మేడం ని ఆశ్చర్య పరిచే లాగా శ్లోక పఠనం చేసినారు. చిరంజీవి బి. సురక్ష,G శ్రీ వైషవి, బి సుస్మిత ప్రధమ,ద్వితీయ మరియు తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. చిరంజీవి సురేష్, s దేవర్శిత మరియు కె పర్ణిక స్పెషల్ జ్యూరీ బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ భగవాన్ సేవసమితి సభ్యులు మరియు చిన్నపిల్లల తల్లి తండ్రులు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు  సర్వమానవాలి అభివృద్ధికి మరియు సమస్యల నివారణకు భగవద్గీత సూచిక అనే అంశం పైన వ్యాస రచన పోటీ జరిగినది.అందులో 8 మంది పాల్గొన్నారు. గెలిచిన విజేత లందరికి శ్రీ కృష్ణ జయంతి రోజున బహుమతులు ఇవ్వబడును అని యాదవ సంఘం సభ్యులు తెలిపారు.

About Author