PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెగా డిఎస్సీ ఫైలు పై నారా లోకేష్  మొదటి సంతకం పై హర్షం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికల వారితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా  నారా లోకేష్ ని కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షుక్షులు సత్రం రామకృష్ణుడు అభినందనలు తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా సత్రం రామకృష్ణుడు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించింది, ఇప్పుడు శ్రీ నారా లోకేష్  విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించి విద్యాశాఖకు మంచి గుర్తింపు తెస్తారని, అదే విధముగా డీఎస్సీ విధి విధానాలకు సంబంధించిన ఫైలుపై శ్రీ నారా లోకేష్ సార్  తొలి సంతకం చేసి కేబినెట్ కు పంపడం చాలా సంతోష విషయం, అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About Author