PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్పీని కలిసిన శివానందరెడ్డి..రమేష్ రెడ్డి

1 min read

జేసీ ని కలిసిన ఎమ్మెల్యే జయసూర్య

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా నూతన ఎస్పీ అది రాజ్ సింగ్ రాణా ను నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,మిడుతూరు మండల టిడిపి కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,కొత్తపల్లి మండల కన్వీనర్ నారపు రెడ్డి,నందికొట్కూరు పట్టణ టిడిపి నాయకులు జమీల్, మధు మరియు తదితరులు ఎస్పీని కలిశారు.సోమవారం సాయంత్రం నంద్యాలలోని ఎస్పీ కార్యాలయంలో వారు మర్యాద పూర్వకంగా కలిసి పూల బోకే అందజేశారు. తర్వాత నందికొట్కూరు నియోజకవర్గం లోని ఆరు మండలాలు మరియు పట్టణంలో ఉన్న సమస్యల గురించి ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఖాతా రమేష్ రెడ్డి తెలిపారు.నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ ను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నంద్యాల జేసీ కార్యాలయంలో సాయంత్రం జేసీ ని మర్యాద పూర్వకంగా కలిసి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి,ఐటీడీపీ మండల కన్వీనర్ ఇంతియాజ్ పాల్గొన్నారు.

About Author