PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రాలయం ఎంపిడిఓ గా శోభారాణి

1 min read

ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపిడిఓ శోభారాణి

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మంత్రాలయం ఎంపిడిఓ గా శోభారాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఇటీవల ఎంపిడిఓ ల బదిలీ ల్లో భాగంగా నందికోట్కూరు ఎంపిడిఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న శోభారాణి బదిలీ పై మంత్రాలయం కు వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎంపిడిఓ మనిమంజరి గోనేగండ్ల కు బదిలీ పై వెళ్లారు. కొత్తగా వచ్చిన ఎంపిడిఓ కు మణిమంజరి బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఎంపిడిఓ శోభారాణి మాట్లాడుతూ మండల ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులు సహయ సహకారాలతో అభివృద్ధి చేసేందుకఁ తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఇక్కడ ఏఒ గా విధులు నిర్వహిస్తున్న అమరేంద్రుడు నందికోట్కూరు కు బదిలీ పై వెళ్లారు. ఇతని స్థానం లో దోర్నిపాడు లో విధులు నిర్వహిస్తున్న రాధ ఇక్కడ కు బదిలీ పై వచ్చారు. అనంతరం రాంపురం గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. రాజకీయాలకు అతీతంగా పనులు చేయాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎంపిడిఓ కు సూచించారు. అలాగే మాధవరం గ్రామంలో ఉన్న టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి సోదరులను మర్యాద పూర్వకంగా కలిశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *