PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెద్దమాదిగ గేరిలో… సమస్యలన్నీ పరిష్కరిస్తా..

1 min read

అర్హత ఉన్న వారందరికీ ఇంటి స్థలాలు…

  • రోడ్లు, మురుగు కాల్వలు, వీధిలైట్లు ఏర్పాటు చేస్తా…
  •  ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు:పేద, మధ్య తరగతి కుటుంబీకులందరికీ ఇంటి స్థలాలు, ఇల్లు కట్టించి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, కానీ  ఇక్కడి ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి ఎవరికైనా ఇంటి స్థలాలు ఇచ్చారా… అని ప్రజలను ప్రశ్నించారు ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. గురువారం పట్టణంలోని పెద్ద మాదిగ గేరిలో కూటమి నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ  టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన టిడ్కో ఇళ్లను సంబంధిత ఇళ్ల యజమాను లకు ఎందుకు ఇవ్వలేదో ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. ఈ క్రమంలో ఇంటి  స్థలాలు ఇవ్వరు…. ఇళ్లు ఇవ్వరూ…. చివరకు ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా ఉచిత వైద్య చికిత్సలు కూడా అందడంలేదని, కర్నూలుకు వెళ్లాలని చెబుతున్నారని పెద్ద మాదిగ గేరి వాసులు అభ్యర్థి డా. పార్థసారధి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి… గెలిపిస్తే పెద్ద మాదిగ గేరిలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాలనీలోని వారందరికీ ఇంటి స్థలాలు ఇస్తానని, రోడ్లు, మురుగు కాల్వలు, వీధిలైట్లు ఏర్పాటు చేసే బాధ్యత తనదేనన్నారు.

డా.పార్థసారధికి.. బ్రహ్మరథం…

పట్టణంలోని పెద్ద మాదిగ గేరిలో ప్రచారానికి వెళ్లిన కూటమి అభ్యర్థి డా. పార్థసారధికి  కాలనీవాసులు బ్రహ్మరథం పట్టారు. మాదిగ సోదరుల మద్దతుతో మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తే… ఆదోనిని మరింత నాశనం చేస్తాడని అభ్యర్థి డా. పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల ఎస్సీ వర్గీకరణ విషయమై దేశ ప్రధాని నరేంద్రమోదీతో చర్చిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మల్లప్ప, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author