PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నీతూ విజయ్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో జైనుల ఆత్మీయ సమావేశం

1 min read

మరోసారి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి

కూటమి అభ్యర్థుల మాయమాటలు నమ్మవద్దు

ఏలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని ఎన్నికల ప్రచారం

పాల్గొన్న పార్టీ శ్రేణులు, మహిళలు కార్యకర్తలు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :  మే 13 జరగబోవు ఎన్నికల మహా సంగ్రామంలో భాగంగా ఏలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆళ్ల నాని మరియు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ ని గెలిపించుటకు ఏలూరు జైన్ మందిరం వద్ద ఏలూరు నగర పాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు నీతూ విజయ్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో జైన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆళ్ల నానికి పూలమాలలు వేసి బొకేలు అందించే శాలువా కప్పి ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా ఆళ్ల నాన్నని, ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ ని గెలిపించాలని ఓటర్లను సవినయంగా శిరసు వంచి నమస్కరిస్తూ అభ్యర్థన చేశారు. జగనన్న పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేయాలని, దుర్మార్గపు చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మవద్దని చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పడుతుందని అసలు కూటమి అభ్యర్థులను మాయమాటలు నమ్మవద్దని అన్నారు. జైన మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆళ్ల నాని విజయం సాధించాలని జైన్ మత గురువులు ఆశీర్వదించువారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ నూర్జహాన్ పెదబాబు, జైన్ సంఘం పెద్దలు మరియు సోదర సోదరీమణులు. వైసిపి పార్టీ శ్రేణులు, మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం విజయవంతం చేశారు.

About Author