PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ బీరప్పస్వామి దేవాలయ నిర్మాణం నకు 30 వేల రూ. విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో  పెద్దపాడు సమీపం లోని ఆదర్శ పాఠశాల పక్కన నిర్మాణం లో ఉన్న శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవాలయము నిర్మాణం కోసం కర్నూలు నగరం లోని బాలాజి నగర్లోని విశ్రాంత ఉపాద్యాయులు కురువ శివప్రసాద్   సోమవారం ఉదయం 30 వేల  రూపాయల నగదును కర్నూలు జిల్లా కురువ సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,జిల్లా ఉపాధ్యక్షులు బి .వెంకటేశ్వర్లు చేతికి నగదు అందజేశారు .ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి మాట్లాడుతూ దాతల సహకారంతో గోపురం నిర్మాణం మరియు అమీలియా హాస్పిటల్ అధినేత డా .ప్రసాద్  సహకారంతో ప్రహారీగోడ .నిర్మాణం  పూర్తి అయినదని మిగతా నిర్మాణ పనులు చాల ఉన్నాయని దాతలు ముందుకు వచ్చి నిర్మాణం కోసం భూరి విరాళాలు అందజెసి  సహకరించవలెనని కోరారు . ఈ కార్యక్రమం లో  జిల్లా నాయకులు కొత్తపల్లె దేవేంద్ర ,పెద్దపాడు పుల్లన్న , బి .సి .తిరుపాలు ,నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు ,వెంకటేశ్వర్లు ,తదితరులు పాల్గొన్నారు .

About Author