PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ జయలక్ష్మి మాత అమ్మ జయంతి…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మాతృమూర్తి శ్రీ జయలక్ష్మి మాత అమ్మ జయంతి సందర్భంగా మన కర్నూలు సూర్య దేవాలయం నందు శ్రీ అనఘా దత్త జ్ఞాన బోధ సభా ట్రస్ట్ సభ్యులు మాతృమండలి సభ్యులు శ్రీ జయలక్ష్మి అమ్మవారి  పాదుకలకు శ్రీ సూక్త విధానంతో వేదమంత్రోచ్ఛారణ మధ్య పంచామృత అభిషేకము సుగంధ ద్రవ్య జలాభిషేకం నిర్వహించి అనంతరం అమ్మపాదుకలకు విశేషముగా అష్టోత్తర శత సంఖ్యతో 11 మార్లు అర్చన గావించి అనంతరం జయలక్ష్మి అమ్మకు విశేషమైన నివేదన  ఫల తాంబూలములు సమర్పించుకున్నాఅనంతరం విశేషముగా శ్రీ సూక్త దుర్గాసూక్త మేధా సూక్త  దేవీ భూ  సూక్త పంచసూక్తములతో విశేషమైన హోమము మహా పూర్ణాహుతి నిర్వహించడం జరిగినది.అనంతరం జయలక్ష్మి అమ్మ జయంతి సందర్భంగా పేదలకు అన్న ప్రసాదము మరియు గొడుగులు, పాదరక్షలు అందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ సభ్యులు Dr.c.ఆంజనేయులు ,T. శివరామకృష్ణ , Dr.CA.నగేష్ వర్మ ,Dr.Y. కృష్ణ మోహన్ ,CA. రమేష్ వర్మ , ప్రకాష్  కృష్ణమూర్తి  మరియు మాతృమండాలి సభ్యులు శ్రీదేవి , రాజేశ్వరి , నాగజ్యోతి , రమాదేవి , పద్మ లత , అనంతలక్ష్మి , సతీష్ శైలజ  పాల్గొనడం జరిగినది.

About Author