PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీమఠం లో పెజావర మఠం పీఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు పెజావర మఠం పీఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థులు గురువారం వచ్చారు. వీరికి మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకునిన ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. వీరి వెంట పండితకేసరి రాజా ఎస్ గిరయచార్,  శ్రీ మఠం అధికారులు గిరి ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author