PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నగరంలో స్టాఫ్ డయేరియా క్యాంపైన్ ప్రోగ్రాం

1 min read

ఏలూరు నగరపాలక సంస్థ 44వ డివిజన్ లో దోమల నివారణ కార్యక్రమం

 ఖాళీ స్థలాలలో ఉన్న నిలువ నీటిలో ఆయిల్ బాల్స్

హెల్త్ ఆఫీసర్ డా:మాలతి సిబ్బందితో పరివేక్షణ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జూలై 2024, నుండి 31, ఆగస్టు, 2024 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాం లో భాగంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) వారి   ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు రాకుండా  మలేరియా విభాగం వారితో 44వ డివిజన్ లోని  రెల్లిస్ పేట, ముస్లిం పేట, డాక్టర్ ప్రసాద్  వీధి, గన్ బజార్ మెయిన్ రోడ్, తదితర ప్రాంతాల్లో దోమల లార్వా నిర్మూనలకు స్ప్రేయింగ్, మురుగు కాలువ కల్వర్టు కింద ఫాగింగ్, ఖాళీ స్థలలోఉన్న నిలవనీటిలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగినది. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఢా:మాలతి , నాయకులు చౌటుపల్లి శ్రీనివాసరావు , వెంకన్న ,మలేరియా ఇన్స్పెక్టర్  దత్తి వేణుగోపాల్ స్వామి , మలేరియా సూపర్వైజర్ డి. దుర్గారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ A. చంద్రశేఖర్ మరియు , ఆరోగ్య కార్య దర్శి, ఆశా కార్యకర్తలు మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

About Author