PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభం

1 min read

ఒలంపిక్ డే సంబరాలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న ఒలంపిక్ డే రన్ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో అంతర్ పాఠశాల బాలబాలికల బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రామాంజనేయులు కలసి పోటీలను ప్రారంభించారు.విజేతలకు స్వర్ణ రజిత కాన్సె పథకాలతో పాటు ప్రతిభాపత్రాలను పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అందజేస్తామని రామాంజనేయులు వివరించారు. ఇటువంటి పోటీలు తరచుగా నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీయవచ్చని ఆయన అన్నారు. అనంతరం బాస్కెట్బాల్ ను వేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి దాసరి సుధీర్, సాఫ్ట్బాల్ వ్యవస్థాపకులు టీ గంగాధర్, బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రతాప్, అలీ, సీనియర్ బాస్కెట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.

About Author