PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండి నైన్ ఆర్ అరేబియన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : నగరంలో ఏర్పాటు చేసిన మండి నైన్ ఆర్ అరేబియన్ రెస్టారెంట్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు పవన్, రవి, మాధవ్, చంద్రశేఖర్ తో పాటు సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ ఎస్ కే మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరేబియన్ రెస్టారెంట్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. దీనికి సంబంధించిన ప్రత్యేకతలను నిర్వాహకులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు వివరించారు. అధునాతన హంగులతో ఈ రెస్టారెంట్ ను తీర్చిదిద్దారు .ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ అరేబియన్ దేశాల వాతావరణం ఉట్టిపడేలా నగరంలో మండి అరేబియన్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు . మారిన పరిస్థితులకు అనుగుణంగా  ప్రజలు కూడా పాత సాంప్రదాయాల నుంచి నూతన సాంప్రదాయాల వైపు అడుగులు వేయాలని చెప్పారు .ప్రస్తుతం రెస్టారెంట్లకు మంచి డిమాండ్ ఉందని యువకులు ఏర్పాటుచేసిన అరేబియన్ రెస్టారెంట్ మంచి ఆదరణతో అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు .ప్రజలు కూడా ఈ రెస్టారెంట్ ను ఆదరించాలని అందరి అభిరుచులకు అనుగుణంగా అన్ని రకాల వెరైటీ ఆహార పదార్థాలను నిర్వాహకులు ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు.

About Author