PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర అభివృద్ధి కూటమి తోనే సాధ్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  రాష్ట్ర అభివృద్ధి కూటమి తోనే సాధ్యమని, మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి ని  త్వరలో నియమించాలని జిల్లా నాయకులను కోరినట్లు జనసేన పార్టీ నాయకులు అనుమేష్, రామాంజి, గణేష్, యేసేబు, తదితరులు  తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన కోసిగిలోని స్థానిక ఎస్ టి కమ్యూనిటీ హాల్లో జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి ని ఇంతవరకు నియమించలేదని త్వరలోనే నియమించి మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ జిల్లా నాయకులను కోరినట్లు వారు తెలిపారు. ఇంతవరకు మంత్రాలయము కు ఎవరిని ఇన్చార్జి గా నియమించలేదని జిల్లా జనసీన నాయకులు తెలిపారని వారు అన్నారు.త్వరలో పార్టీ బలోపేతానికి మండల గ్రామ స్థాయి కమిటీలను నిర్వహిస్తామన్నారు. కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ 21 సీట్లు గెలుపొందడం  జనసేన పవన్ కళ్యాణ్ ను యావత్ భారతదేశం  గర్విస్తుందన్నారు . పవన్ కళ్యాణ్ ఒక శక్తి అని ప్రధానమంత్రి కూడా పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పార్టీకి కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలవడమే జనసేన పార్టీ  లక్ష్యం అన్నారు.త్వరలోనే రాష్ట్ర అధిష్టానం మంత్రాలయం కు సమర్థవంతమైన నాయకుడిని, విద్యవేత్తాను జానసేన ఇన్చార్జి గా నియమించాలని వారు కోరారు .ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు, మారెప్ప, ఈరన్న, ఉమేష్, రమేష్, రాంబాబు, వీరేష్, ఉదయ్, మహమ్మద్, మల్లికార్జున, ఆనంద్, ఆకాష్, బజారి, మోజెష్, సురేష్, రాజేష్,నాగరాజు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author