PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెట్రోల్ బంకు లో దొంగతనం విలువైన వస్తువులు చోరీ

1 min read

పరిశీలించిన పొలిసులు

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  స్థానిక పట్టణములోని నంద్యాల రోడ్డులో ఉన్న మూతబడ్డ పెట్రోల్ బంకు లో దొంగతనం జరిగినట్లు తెలిసింది. ఈ మేరకు పెట్రోల్ బంకు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం . విలువైన విద్యుత్ యంత్ర పరికరాలు, అగ్నిమాపక నిరోధక ఉపకరణాలు మరి కొన్ని వస్తువులు చోరీ కి గురైనట్లు ఆ యజమాని పోలీసులకు వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. దొంగతనం జరిగిన ప్రాంతాన్ని యస్.ఐ తో పాటు ముగ్గురు సిబ్బంది కూడా పరిశలించినట్లు తెలిసింది. ఈ చోరీలో దాదాపు 1.50 లక్షల విలువైన సామాగ్రి చోరీ చేయబడినట్లు పోలీసులకు అందించిన వివరాలను బట్టి తెలుస్తుంది. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు యజమాని వెళ్లగా విచారణ చేస్తామని పోలీసులు చెప్పి పంపినట్లు సమాచారం. మరి ఈ సంఘటన పై లిఖిత పూర్వక ఫిర్యాదు తీసుకుంటారా, విచారణ చేస్తామంటూనే కాలం గడిపేస్తారా అన్నది పోలీసులు తీసుకోబోయే చర్యలనుబట్టి వెల్లడి కావాల్సివుంది.

About Author