PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేషన్ డీలర్ల రాజీనామాలను ఆపండి..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు (మిడుతూరు): తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నందికొట్కూరు మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరియు నంద్యాల పార్లమెంట్ సభ్యులు  డాక్టర్ బైరెడ్డి శబరమ్మ ఆదేశాల మేరకు రేషన్ డీలర్ల చేత బలవంతపు రాజీనామాలను కొద్ది రోజుల పాటు ఆపాలని అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వంట మనుషుల తొలగింపులను కూడా కొన్ని రోజులు ఆపాలని మిడుతూరు తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాంభూపాల్ రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు.అదే విధంగా ఎంఈఓ రామిరెడ్డికి నాయకులు వినతి పత్రం ఇచ్చారు.వీటిని ఆపాలని కోరుతూ గురువారం ఆత్మకూరు ఆర్డీవో దాసు ను కలసి నాయకులు విన్నవించినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వినతి పత్రం అందజేసిన వారిలో టిడిపి నాయకులు వంగాల సీతారామిరెడ్డి తలముడిపి అంకిరెడ్డి,తువ్వా అయ్యపు రెడ్డి,బన్నూరు శ్రీనివాస్ రెడ్డి బైరెడ్డి అభిమాని పైపాలెం నాగేశ్వరావు నాగలూటి గోకారి పైపాలెం మాజీ డీలర్ దేవ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

About Author