PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థి చదువుకో..గమ్యాన్ని చేరుకో

1 min read

విద్యార్థినీలు భయపడవద్దు ఆకతాయిల ఆటలు అరికడతామం:సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి

ప్రగతిశీల విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి:డక్క కుమార్

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పట్టణంలో ప్రభుత్వ బాయ్స్ హైస్కూల్ నందు విద్యార్థి చదువుకో గమ్యాన్ని చేరుకో అనే అవగాహన కార్యక్రమం ప్రగతి శీల విద్యార్థి సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి డక్క కుమార్ అధ్యక్షతన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి,ఎంఈఓ సుభాన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు నందికొట్కూరు పట్టణంలో మాట్లాడుతూ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో చేరుకోవాలని అదేవిధంగా విద్యార్థులు విద్యార్థులు మత్తు పదార్థాలకు సే నో డ్రగ్స్ అంటూ వాటిని దూరంగా ఉంచాలని వారాఅన్నారు. అదేవిధంగా విద్యార్థినిలు పరిచయం లేని వ్యక్తితో ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో చాటింగ్ చేయొద్దని వారు మిమ్మల్ని మాయమాటలతో మోసపూరితంగా ఇబ్బంది గురి చేస్తారని వారన్నారు అదేవిధంగా అమ్మాయిలు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళద్దని ముఖ్యంగా విద్యార్థినులు నిర్మిరియామంగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్లొద్దని పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి సార్ గారు తెలిపారు అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు మొబైల్ ఫోన్స్ కి దూరంగా ఉండాలంటూ వాటి ద్వారా విద్యార్థులు చెడిపోవద్దని అని వార్తలు తెలిపారు అదే విధంగా విద్యాభివృద్ధి కోసం మాత్రమే విద్యార్థులు ఫోన్లు వివరించాలని చెడు అలవాట్లకు చెడు సావాసాలకు దూరంగా ఉండాలన్నారు.విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ రామిరెడ్డి సార్ గర్ల్స్ జూనియర్ మరియు హై స్కూల్ ప్రిన్సిపాల్ పార్వతి మేడం ఫిజిక్స్ లెక్చరర్ కాజా హుస్సేన్ మరియు నూర్,పిటి విజయ కుమారి,పిడి జస్వింత మేడం మరియు ప్రగతిశీల విద్యార్థి సమాఖ్య నాయకులు అశోక్ ,శ్రీకాంత్, రాజా, జీవన్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *