PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెడికల్ విద్యార్థిని హత్యచార నిందితులను ఉరి తీయాలి.. విద్యార్థి సంఘాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:  వారం రోజుల కిందట కలకత్తాలోని ఆర్ జి కార్ హాస్పిటల్ లో మౌమిత అనే జూనియర్ డాక్టర్ ను అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన సైకోలను బహిరంగంగా ఉరి తీయాలనీ  కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లో విచారణ జరపాలని,డాక్టర్ లకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని అలాగే ఆ డాక్టర్ కు న్యాయం చేయాలని శనివారం నాడు  పాణ్యం మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో జాతీయ రహదారి దిగ్బంధం చేసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ నేటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని. తూతూ మంత్రంగా మహిళా చట్టాలు తీసుకొని వచ్చి వాటిని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాది పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా అధ్యక్షులు వనం వెంకటాద్రి, యువజన సంఘం నాయకుడు బత్తిన ప్రతాప్, రాజు, మహేష్, నవీన్ ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author