PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : రాష్ట్ర స్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్ పోటీలకు మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక అయినట్లు ప్రధానోపాధ్యాయులు హంపయ్య తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ రోజు  కర్నూల్ అవుట్ డోర్ స్టేడియం లో జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్ 14 మరియు అండర్ 17 వాలీబాల్ ఎంపిక పోటీలు స్థానిక అవుట్డోర్ స్టేడియంలో జరిగాయని తెలిపారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి  అండర్ 14 విభాగంలో టి . సోమేష్ మరియు అండర్ 17 విభాగంలో కె. చరణ్ ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తు అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *