PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూర్ ఎంపీడీఓ గా సుబ్రహ్మణ్యం శర్మ..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నూతన ఎంపీడీవోగా డి సుబ్రహ్మణ్యం శర్మ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.ఈయన కడప జిల్లా చెన్నూరు నుండి ఇక్కడికి బదిలీపై వచ్చారు.ఈయన గతంలో ఇక్కడే ఈఓఆర్డి గా ఆరు సంవత్సరాల పాటు పని చేశారు.ఇక్కడ పనిచేస్తున్న ఎంపీడీవో శోభారాణి మంత్రాలయం నకు బదిలీపై వెళ్లారు.ఎంపీడీవోను కార్యాలయ సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శులు శుభాకాంక్షలు తెలియజేశారు.  అదే విధంగా ఈఓఆర్డి గా ఎస్ వెంకటరంగ నాయక్ విధుల్లో చేరారు.ఇక్కడ ఉన్న ఈఓఆర్డి సంజన్న మిడుతూరు కు బదిలీ అయ్యారు.జిల్లా పరిషత్ నుండి సీనియర్ అసిస్టెంట్ గా శశికళ ఇక్కడికి వచ్చారు.మధ్యాహ్నం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి ఎంపీడీవో మరియు ఉపాధి హామీ పథకం సిబ్బందితో ఉపాధి పనుల పురోగతి గురించి డిప్యూటీ సీఈవో మాట్లాడారు.గ్రామాల్లో ఉపాధి పనులను పెంచాలని నిర్దేశించిన లక్ష్యాలను ఉపాధి సిబ్బంది అధిగమించాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన ఆ సిబ్బందిని హెచ్చరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *