PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థుల విజయపరంపర

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నేడు విడుదలైన ఇంటర్ ప్రథమ సంవత్సర సప్లమెంటరీ పరీక్షా ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు విజయపరంపర కొనసాగించారని శ్రీ చైతన్య కళాశాళల ఎ.జి.ఎమ్. మురళీకృష్ణ పత్రికా ప్రకటనలో తెలిపారు.జూనియర్ విభాగం నందు యం.పి.సి. లో 470 మార్కులకు గాను యమ్. సాయి లిఖిత 467 మార్కులు, ఎ.నందిని 467 మార్కులతో రాష్ట్ర ప్రథమ మార్కును కైవసం చేసుకున్నారని తెలిపారు. అదే విధంగా డి. పవన్ కుమార్ 466 మార్కులు, కె.డి. దరహాస్ 466 మార్కులు సాధించారని తెలిపారు. తమ వద్ద యం.పి.సి. విభాగంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి 410, ఆ పైన మార్కులు సాధించారని తెలిపారు.జూనియర్ బై.పి.సి. విభాగం నందు 440 మార్కులకు గాను ఎస్.ఎన్.హర్శిత యాదవ్ 436 మార్కులు, ఎ. మంజులత 436, కె.ప్రేమ్ కుమార్ 435, పి.పూజిత 435, ఎమ్.రవిత్రయిని 435 లాంటి ఎన్నో ఉత్తమ మార్కులు సాధించారని తెలియజేశారు. తమ వద్ద బై.పి.సి. విభాగంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి 400, ఆ పైన మార్కులు సాధించారని తెలిపారు.ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను కళాశాల డీన్స్ బాలాజీ , మరియు సరళ  అభినందించారు.

About Author