PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైసీపీని ఆదరించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పట్టణంలో గల,26వ వార్డు (వార్డ్ కౌన్సిలర్ నీలకంఠ)వార్డ్ నందు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక  మరియు కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని బివై.రామయ్య ల అభ్యర్థిత్వాలను బలపరుస్తూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి  కోడలు శ్రీమతి బుట్టా సాహితి .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  సంక్షేమ పథకాలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకు అందించారని గుర్తుచేశారు.సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైయస్.జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ ప్రచారం,వైసీపీ పార్టీ ముఖ్యనేతలు,కార్యకర్తలు,నాయకులు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

About Author