PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వై వి యు ఉద్యోగి సూర్యనారాయణ రెడ్డి సేవలు మరువరానివి

1 min read

వై వి యు ఇన్చార్జ్ కుల సచివులు. ఎస్. రఘునాథ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ కడప:  యోగి వేమన విశ్వవిద్యాలయం అబ్దుల్ కలాం కేంద్ర గ్రంథాలయంలో పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినేట్ కె. సూర్యనారాయణ రెడ్డి సేవలు ప్రశంసనీయమని వై వి యు కుల సచివులు. ఎస్. రఘునాథ రెడ్డికొనియాడారు. శనివారం విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో పదవి విరమణ సందర్భంగా గ్రంథాలయం సిబ్బంది సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి  కుల సచివులు ఎస్. రఘునాథరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఉద్యోగి సూర్యనారాయణ రెడ్డి కి శాలవా కప్పి పూలమాలతో సత్కరించారు. ఆయనకు ఙ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా కుల సచివులు ఎస్. రఘునాథరెడ్డి మాట్లాడుతూ పలు డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ సూర్యనారాయణ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. గ్రంథాలయం అసిస్టెంట్లు బి. డాక్టర్ ప్రసాద్ రావు. ఆర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రంథాలయంలో సూర్యనారాయణ రెడ్డి ఏడేళ్ల పాటు చక్కటి బాధ్యతతో పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారని, ఈరోజు ఆయన పదవీ విరమణ చేయడం తమకు బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆఫీస్ సూపరింటిండెంట్ శ్రీనివాస ప్రసాద్. జూనియర్ అసిస్టెంట్ శివ ప్రసాద్. గ్రంథాలయం లైబ్రరీ అసిస్టెంట్లు గ్రేడ్ వన్. డాక్టర్ బి ప్రసాద్ రావు. ఆర్ విజయ్ కుమార్. జూనియర్ అసిస్టెంట్లు ఎం రాజశేఖర్ రెడ్డి. ఎం షబ్బీర్ అహ్మద్. పి పవన్ కుమారి. సి శివకుమారి. బి గోపాల్ నాయక్. ఎం ఆంజనేయులు. ఆఫీస్ సబార్డినేట్  ఎన్ గోపాలకృష్ణ. సి ప్రభావతి శాలువా కప్పి పూలమాలతోసూర్యనారాయణ రెడ్డిని సత్కరించారు.

About Author