PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ ను సస్పెండ్ చేయండి

1 min read

విద్యార్థి,యువజన సంఘాలు, బాధిత కుటుంబాలు….

పల్లెవెలుగు వెబ్   ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ను సస్పెండ్ చేయకపోతే నిరాహార దీక్ష చేస్తామని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు బి.మహేంద్ర బాబు,సురేంద్ర బాబు, రాజీవ్ బాధిత కుటుంబాలు రమేష్, ఖాదర్ బాషా లు డిమాండ్ చేశారు.  సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజాధర్భర్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి అక్రమాలు చేస్తు పసి పిల్లల ప్రాణాలు తీస్తున్న సూపరిండెంట్ మైత్రి పై చర్యలుతీసుకోవాలని గత నెల రోజుల నుండి అధికారులకు ఫిర్యాదు చేసిన, ఒక గర్భిణీ కు ఆమె వ్యక్తిగత క్లినిక్ లో సీజరియన్ చేసి బేబీ ప్రాణాలు తీసిందని రోడ్డు మీదకు వచ్చి నిరసన చేసిన సంబంధిత డిసిహెచ్ఎస్ రెండు సార్లు విచారకు వచ్చిన ఆమె పై ఎటువంటి చర్యలుతిసుకోలేని పరిస్థితి ఉందన్నారు. అదేవిదంగా సమగ్ర విచారణ జరుపకుండా  సూపరిండెంట్ రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గి ఆమె చేసే అవినీతి కు వత్తస్సు పలుకుతున్నారని అన్నారు. కావున ఇప్పటికైనా స్పందించి సూపరిండెంట్ మైత్రి ప్రయివేట్ క్లినిక్ సిజ్ చేసి ఆమెను సస్పెండ్ చేయాలని లేనిపక్షం లో నిరాహార దీక్షలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో నాయకులు ఇమ్రాన్,భాష, రవి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

About Author