PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జోహారాపురం లో సయ్యద్ అల్లాబకష్ వలి ఉరుసు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరం లోని జోహారాపురం లో ఈ నెల 13-10-2024 ఆదివారము గంధము,14-10-2024 సోమవారము ఉరుసు (తట్టీలు ), 15-10-2024 మంగళవారము కిస్తీలు (జియారత్ )ఉరుసు మహోత్సవం జరుగుతుందని దర్గా ముత్తవలి(నిర్వాహకులు )సయ్యద్ అల్లాఉద్దీన్ షరీఫ్ పాషా తెలిపారు.ఈ సందర్బంగా నిర్వాహకులు సయ్యద్ అల్లా ఉద్దీన్ షరీఫ్ పాషా మాట్లాడుతూ జోహారాపురము గ్రామం లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి 3 రోజులు ఆనందంగా జరుపు కుంటారని, ఈ ఉరుసు కు జిల్లా నలుమూలలనుండి హాజరు అవుతారని చెప్పారు. గత 370 సంవత్సరాల నుండి ఈ ఉరుసు మహోత్సవం జరుగుతుందని, కావున భక్తులందరు ఉరుసు మహోత్సవం నకు హాజరై సయ్యద్ అల్లాబకష్ వలి దయకు పాత్రులై ప్రసాదం స్వీకరించి, జయప్రదం చేయవలెనని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *